కరోనా బాధితులకు అండగా పువ్వాడ ఫౌండేషన్

112
puvvada
- Advertisement -

ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంట , పువ్వాడ ఫౌండేషన్- ఖమ్మం కలిసి సంయుక్తంగా రెండున్నర కోట్ల రూపాయల విలువైన 250 ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్ల ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు . వాటిని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రిని అభినందించారు.

ఈ ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్ల ను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదల కోసం వినియోగించనున్నట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. అమెరికా నుండి ఈ కొత్త కాన్సన్ట్రేటర్ల ను దిగుమతి చేసే విషయంలో సునీల్ చావలి సహకరించినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు , ఎమ్మెల్యేలు పాల్గొన్నారు .

- Advertisement -