రామమందిర కార్యక్రమానికి వెళ్లడం లేదు!

14
- Advertisement -

అయోధ్య రామమందిరం పూర్తిగా బీజేపీ కార్యక్రమం అని అందుకే రామ మందిర ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరుకావడం లేదన్నారు నిశ్చలానంద సరస్వతి. పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్‌లో జాతరకు పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాముడి విగ్రహాన్ని సరైన స్థలంలో ప్రతిష్టించాల్సిన అవసరం ఉందన్నారు.

రామ మందిరంపై నలుగురు శంకరాచార్యుల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని.. దీనిపై మేం ఏకీభవించడం లేదన్నది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. విగ్రహం ఏదైనా సరే సక్రమంగా ప్రతిష్ఠించబడాలన్నదే తమ అభిమతం అన్నారు. సరైన పూజలు, స్థాపన లేకపోతే విగ్రహానికి ఆటంకం ఏర్పడుతుందన్నారు.

అందుకే జనవరి 22న నేను అయోధ్యకు వెళ్లడం లేదని.. అయోధ్యపై నాకు కోపం లేదన్నారు. రాజకీయ నేతలు ప్రతిరంగంలో జోక్యం చేసుకోవడం పిచ్చి అని..చట్టాన్ని పాటించడం ప్రధానమంత్రి బాధ్యత అని.. చట్టాన్ని ఉల్లంఘించడం తనకంటూ పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించడమంటే దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం అన్నారు.

Also Read:పెదవులు పగిలితే.. ఇలా చేయండి!

- Advertisement -