జోడో యాత్రలో విషాదం…

42
- Advertisement -

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్రలో విషాదం నెలకొంది. పంజాబ్‌లో కొనసాగుతున్న ఈయాత్రలో కాంగ్రెస్‌ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి గుండెపోటుతో మరణించారు. పంజాబ్‌లోని ఫిల్లౌర్‌లో యాత్ర కొనసాగుతున్న వేళ ఎంపీ సంతోక్‌ ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా…మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు.

ఎంపీ సంతోక్ మృతిచెందినట్లు పంజాబ్ రాష్ట్ర సీఎం భ‌గ‌వంత్ మాన్ సింగ్ త‌న ట్విట్ట‌ర్‌ ద్వారా తెలిపారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేత‌లు రాణా గుర్జీత్ సింగ్‌, విజ‌య్ ఇంద‌ర్ సింగ్లాలు ఎంపీ మృతిని ద్రువీక‌రించారు. ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ యాత్ర‌ను నిలిపివేశారు. గ‌తంలో సంతోక్ పంజాబ్ మంత్రిగా చేశారు. సంతోక్‌సింగ్ గతంలో పంజాబ్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

ఇవి కూడా చదవండి…

తపస్వి లక్షణం ఇది కాదు…బీజేపీ

మంచి ఆలోచనల పెంపే భోగి…

‘ భోగి ‘ పండుగ ప్రత్యేకత తెలుసా ?

- Advertisement -