పుదుచ్చేరిలో లాక్‌డౌన్ పొడగింపు..

129
tamilisai
- Advertisement -

దేశంలో పలు రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్‌ని పొడగిస్తున్నాయి. పుదుచ్చేరిలో క‌రోనా కేసుల దృష్ట్యా ఆంక్ష‌లు కొన‌సాగుతుండగా మే 24 వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. కేసులు తగ్గ‌కపోవ‌డంతో పుదుచ్చేరిలో లాక్‌డౌన్ ను మ‌రోసారి పొడిగిస్తున్న‌ట్టు లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్ డాక్ట‌ర్ త‌మిళిసై సౌంద‌రాజ‌న్ ప్ర‌క‌టించారు.

క‌రోనా రెండోద‌శ నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని… నిబంధ‌న‌ల ప్ర‌కారం నిత్య‌వ‌స‌ర దుకాణాలు మ‌ద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తాయ‌న్నారు. ఆ తర్వాత ప్ర‌జ‌లు అన‌వ‌స‌రంగా రోడ్ల‌మీద‌కు రాకుండా ఇళ్ల‌లోనే సుర‌క్షితంగా ఉండాల‌ని త‌మిళిసై సూచించారు.

- Advertisement -