రీ ఎంట్రీ ఇవ్వనున్న మలయాళీ భామ..

63
- Advertisement -

బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రవితేజ, రాజశేఖర్ వంటి అగ్ర కథానాయకులతో నటించిన మలయాళీ భామ త్వరలో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. దాదాపుగా పదేళ్లు దూరంగా ఉన్న ఆమె త్వరలోనే వస్తున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా ఈవిషయాన్ని వెల్లడించింది. ఆమె ఎవరో కాదు… మీరా జాస్మీన్.

భద్ర, గుడుంబా శంకర్, గోరింటాకు లాంటి సూపర్ హిట్‌ సినిమాలో నటించిన ఈ భామ తాజాగా తను నటిస్తోన్న సినిమాకు డబ్బింగ్‌ చెబుతున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఇంకా సినిమా వివరాలు ప్రకటించలేదు. అయితే ఆమె ఏ సినిమాలో నటిస్తున్నారో తెలియాలంటే మరికొంత కాలం వేచి ఉండక తప్పదు. మీరా చివరిగా నటించిన తెలుగు సినిమా మోక్ష(2013)లో విడుదలైంది. ఆ తర్వాత ఆమె మలయాళం సినిమాలతో బిజీగా ఉండి..తెలుగుకు దూరమైంది.

ఇవి కూడా చదవండి…

చిరు , బాలయ్య మళ్ళీ పోటీ?

సమంత సినిమా వాయిదా?

కీడా కోలా… కామెడీ కింగ్ బ్రహ్మానందం

- Advertisement -