మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ప్రొఫెసర్ లింబాద్రి..

110
Professor Limbadri
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ లింబాద్రి నియమితులయ్యారు. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తదనంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు లింబాద్రి ఈ స్థానంలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడిగా ప్రొఫెసర్‌ లింబాద్రి కొనసాగుతున్నారు.

ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఉన్న పాపిరెడ్డి పదవీకాలం ఈరోజుతో ముగియడంతో లింబాద్రికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ లింబాద్రి ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -