- Advertisement -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దిల్ రాజు దంపతులు. ఇవాళ ఉదయం వీఐపీ దర్శన సమయంలో తన సతీమణి తేజస్వితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశ్వీరచనాలు ఇచ్చారు.
మే 10న నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్పల్లి వెంకటేశ్వర ఆలయంలో తేజస్వినిని (వైఘా రెడ్డి)ని రెండో పెళ్లి చేసుకున్నారు దిల్ రాజు. లాక్డౌన్ నిబంధనల కారణంగా వివాహానికి పరిమిత సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. వరంగల్కు చెందిన తేజస్విని కుటుంబం హైదరాబాద్లో స్థిరపడ్డారు.
- Advertisement -