విద్యుత్ అధికారులతో ఎస్పీడీసీఎల్‌ సీఎండీ సమీక్ష..

235
cmd raghuma reddy
- Advertisement -

రెండు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షల నేపధ్యం లో విద్యుత్ శాఖ సూపెరింటెండింగ్ ఇంజనీర్, చీఫ్ జనరల్ మేనేజర్ లతో విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ జి రఘుమా రెడ్డి.

విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయలు లేవు…అన్ని ఫీడర్లు సక్రమంగా ఉన్నాయని తెలిపారు రఘురామరెడ్డి. వర్షం నీరు నిల్వ ఉన్న చోట గల విద్యుత్ స్తంభాలు, తీగల వద్ద ఇన్సులేషన్ ను తనిఖీ చేసి, విద్యుత్ లీకేజీ లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థ కు తెలియజేయాలన్నారు. . వోల్టేజ్ లో హెచ్చు తగ్గులు వున్నా, విద్యుత్ సరఫరా లో అంతరాయం కలిగితే 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగలరని సూచించారు సీఎండీ శ్రీ జి రఘుమా రెడ్డి.

- Advertisement -