- Advertisement -
ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ…2024లో జరిగే ఎన్నికల తీర్పు ముందుగానే ప్రజలు ఇచ్చారని ప్రతిపక్షాలకు చురకలు అంటించారు.
ఈ నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలపై స్పందించారు రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్. మోడీ చేసిన ఎన్నికల గారడీ గురించి ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఈ ఫలితాలను చూసి ప్రతిపక్షాలు నిరుత్సాహానికి గురికావాల్సిన అవసరం లేదని… భారత్ లో అధికార మార్పడి కోసం 2024లో ఎన్నికలు జరుగుతాయన్నారు.
రాష్ట్ర ఎన్నికల ఫలితాలతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు జరగదని సాహెబ్కు తెలుసు….ఈ గారడీకి పడిపోకండి, తప్పుడు కథనంలో భాగం అవ్వకండి అని పేర్కొన్నారు ప్రశాంత్.
- Advertisement -