నితీశ్‌కు మతి తప్పింది: ప్రశాంత్ కిషోర్

89
pk
- Advertisement -

బిహార్ సీఎం నితీశ్‌ కుమార్‌పై మరోసారి మండిపడ్డారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. వ‌య‌సు ప్ర‌భావంతో నితీశ్‌కు మ‌తిత‌ప్పింద‌ని ఎద్దేవా చేశారు.నితీశ్ కుమార్ చెప్పేవ‌న్నీ అస‌త్యాల‌ని…తాను జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయ‌మ‌న్నాన‌ని చెబుతూనే, బీజేపీ ఎజెండా ప్ర‌కారం ప‌నిచేస్తున్నాన‌ని ఆరోపించ‌డం విడ్డూరంగా ఉంద‌ని మండిపడ్డారు.

ఇక కొంతకాలంగా నితీశ్ – ప్రశాంత్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నితీశ్ కుమార్ త‌న‌ను ఇంటికి ఆహ్వానించాడ‌ని, జేడీయూలో చేరి పార్టీని న‌డిపించాల‌ని ఆఫ‌ర్ చేశాడ‌ని చెప్పగా దీనిని కొట్టిపారేశారు నితీశ్. పీకేను తాను పార్టీలోకి ఆహ్వానించాన‌న‌డం అబ‌ద్ధ‌మ‌ని… కొన్నేండ్ల క్రితం జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయాలంటూ కిషోర్ త‌న‌కు స‌ల‌హా ఇచ్చాడ‌ని నితీశ్ ఆరోపించారు.

- Advertisement -