యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో బిజీగా ఉన్నారు. రన్ రాజా రన్ ఫేమ్ దర్శకుడు సుజీత్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఈసినిమాను చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈమూవీని చిత్రకరిస్తున్నారు. ఇక ప్రభాస్ సరసన బాలీవుడ్ నటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈమూవీని నిర్మిస్తున్నారు. ఇటివలే దుబాయ్ లో ఈసినిమాలోని కీలక సన్నివేశాలను, ఫైట్ లను చిత్రికరించారు.
40 రోజులు పాటు ఈసిన్నివేశాలను చిత్రకరించారు. రెండు పాటలతో పాటు భారీ యాక్షన్ చిత్రాలను దుబాయ్ లో తెరకెక్కించారు. ఇటివలే దుబాయ్ లో షెడ్యూల్ పూర్తిచేసుకుని తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. తాజాగా ఈసినిమా రెండవ షెడ్యూల్ ను నేటి నుంచి ప్రారంభించారు. ఇప్పటివరకూ సగం వరకూ చిత్రకరణ పూర్తి కాగా మిగతా సగం చిత్రకరణను హైదరాబాద్ లోని పలు స్టూడియోలలో షూటింగ్ జరుపనున్నారు. హీరో, హీరోయిన్ ల మధ్య జరిగే కొన్ని సన్నీవేశాలను హైదరాబాద్ లో చిత్రకరించనున్నట్లు తెలిపారు చిత్రబృందం.
ఈఘూటింగ్ లో పాల్గోనడానికి ముంబాయ్ నుంచి ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా కపూర్ హైదరాబాద్ కు వచ్చింది. ఈరోజు నుంచి ప్రభాస్ తో కలిసి షూటింగ్ లో పాల్గోననుంది. ఇక శ్రద్దా కపూర్ ఇంతవరకూ ఏ తెలుగు సినిమాలో నటించలేదు. సాహో తో ఆ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది శ్రద్దా కపూర్. వచ్చే సమ్మర్ లో ఈసినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.