- Advertisement -
సాహో తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే రాధేశ్యామ్,ఓం రౌత్ దర్శకత్వంలో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్ మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించనున్నట్టు పేర్కొన్నారు. ప్రముఖ నటుడు లేకుండా ప్రతిష్టాత్మక చిత్రం ఎలా చేస్తాం అంటూ వీడియోని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణే హీరోయిన్గా నటిస్తోంది.
- Advertisement -