హనుమంతుడి కోసం ఓ సీట్

43
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు తిరుపతిలో తారకరామా స్టేడియంలో అట్టహాసంగా సాగనుంది. దీనికోసం ఇప్పటికే తారకరామా స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. రామాయణం నేపధ్యంగా తీస్తున్న చిత్రం కావడంతో అధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని చేపట్టాలని చిత్ర బృందం సంకల్పించింది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రభాస్ తిరుమల చేరుకున్నారు.

కాగా, ప్రీ రిలీజ్ వేడుకను నెవర్ బిఫోర్ అనే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కి మేకర్స్ దాదాపుగా ఓ రెండు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ భారీ ఈవెంట్ 2 లక్షల మంది అభిమానుల సమక్షంలో జరగనుందని టాక్. ఆది పురుష్’ మూవీ జూన్ 16న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా ఆడే ప్రతి థియేటర్‌లో ఒక సీటును శ్రీరామ పరమ భక్తుడు హనుమంతుడి కోసం కేటాయించనున్నారు.

Also Read:దండు మల్కాపుర్‌లో కామన్ ఫెసిలిటీ సెంటర్..

ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. కాగా, ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సీతాదేవిగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్ దత్త నటించారు. ఇంతకీ ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. ఈ సినిమా పై అయితే భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read:Adipurush:వినూత్న ప్రయోగం

- Advertisement -