ఉఫ్.. ఈ డైరెక్టర్ ని ఎవరికైనా చూపించడ్రా

35
- Advertisement -

మోహన్ బాబు హీరోగా వచ్చిన సన్నాఫ్‌ ఇండియా లెక్కలన్నీ చిప్పలే అని టాక్. డిజాస్టర్ లో మోహన్ బాబు సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడని కూడా కథలు కథలుగా చెప్పుకున్నారు సినిమా వాళ్ళు. ఇలాంటి దిక్కుమాలిన సినిమా తీసింది వ్యక్తి పేరు డైమండ్‌ రత్నబాబు. తాను అద్భుతమైన దర్శకుడిని అంటూ, తన దర్శకత్వ వ్యవహారం అమోహం అంటూ ఇతగాడే చెప్పుకోవడం విశేషం.

సన్నాఫ్‌ ఇండియా సినిమా కలెక్షన్లు చూసాకా, ఇక రత్నబాబు పై వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరోపక్క సన్నాఫ్‌ ఇండియా కలెక్షన్లు చాలా దారుణంగా వచ్చాయి. కేవలం 2 శాతం టిక్కెట్లు మీదే సన్నాఫ్‌ ఇండియా థియేటర్స్ నడిచాయి. ఈ లెక్కలను బట్టి.. ఈ నాలుగైదు దశాబ్దాల్లోనే ఈ రేంజ్ ప్లాప్ మరో సినిమాకి దక్కలేదు. ముఖ్యంగా సన్నాఫ్‌ ఇండియాతో టాలీవుడ్ కి డిజాస్టర్ల అమ్మ మొగుడు లాంటి సినిమాని అదించాడు రత్నబాబు.

Also Read: Agent:ఓటీటీ డేట్ ఫిక్స్

అయితే విచిత్రంగా ఈ సినిమాకి రీమేక్ చేస్తా అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ‘సన్నాఫ్‌ ఇండియా’ కథను సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు చెప్పానని దర్శకుడు డైమండ్‌ రత్నబాబు చెప్పారు. ‘అన్‌స్టాపబుల్‌’ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ఈ సినిమా కథను రజనీకాంత్‌కు చెప్పానని, కథ బాగుందని చెప్పారు. అయితే, నేను చేసిన ప్రయోగాన్ని ప్రేక్షకులు అంగీకరించలేదు. అవకాశం వస్తే దీన్ని రీమేక్‌ చేయాలనే ఆలోచన ఉందని రత్నబాబు చెప్పారు. దీంతో.. బాబోయ్ ఈ డైరెక్టర్ ని ఎవ్వడికన్నా చూపించడ్రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: హనుమంతుడి కోసం ఓ సీట్

- Advertisement -