ఆర్టీసీ డ్రైవర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగిపై దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ సోదరులపై దాడులను ఉపేక్షించం అని… భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం అన్నారు పొన్నం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం వద్ద మా ఆర్టీసీ డ్రైవర్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. విధుల్లో నిబద్ధతతో పని చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగిపై ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేయడం హేయమైన చర్య. ఈ ఘటనపై నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారితో ఫోన్లో…
— Ponnam Prabhakar (@Ponnam_INC) November 19, 2025
Also Read:లంగ్స్ ఆరోగ్యం కోసం బ్రీతింగ్ చెక్!

