హుజుర్ నగర్ లో ప్రారంభమైన పోలింగ్

452
polling
- Advertisement -

హుజుర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తును ఎర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. హుజుర్ నగర్ లో మొత్తం 302 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును పరిశీలించనున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 36 వేల 842 మంది ఓటర్లు ఉన్నారు. కాగా ఉదయం నుంచే ఓటర్లు పోలింంగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో నిల్చున్నారు. కాగా ఈనెల 24వ తేదిన ఫలితాలు వెలువడనున్నాయి.

- Advertisement -