కేఏ పాల్‌పై పంజాగుట్ట పీఎస్‌లో కేసు

439
ka paul
- Advertisement -

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు షాక్ తగిలింది. అమెరికా వెళ్లేందుకు స్పాన్సర్‌ షిప్ లెటర్‌ ఇస్తానని డబ్బులు తీసుకొని  తనను మోసం చేశారని సత్యవతి అనే మహిళ పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. డబ్బులు డిపాజిట్ కాగానే తన పోన్ నెంబర్ బ్లాక్‌ లిస్టులో పెట్టారని ఫిర్యాదులో పేర్కొంది. పాల్ తో పాటు అతని సహచరులు జ్యోతి, విజయ్‌లపై ఫిర్యాదు చేశారు సత్యవతి. దీంతో పోలీసులు కేసు నమోదుచేశారు.

అమెరికా వెళ్లేందుకు విజిట్ వీసా స్పాన్సర్షిప్ లెటర్ అందిస్తానని రామచంద్రపురం కు చెందిన సత్యవతి అనే మహిళను 15 లక్షలు డిమాండ్ చేశారు పాల్ అండ్ టీం. అంతమొత్తం ఇచ్చేందుకు సత్యవతి నిరాకరించడంతో చివరకు రెండు లక్షలకు బేరం కుదిరింది. డబ్బులు ఇచ్చినా తనకు స్పాన్సర్ షిప్ లెటర్ ఇవ్వకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -