ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ తేది ఖరారు..

264
Counting
- Advertisement -

తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ తేదిని ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 4వ తేదిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వెలువడనున్నాయి. నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ప్రమాణ స్వీకారం చేయకుండానే మండల, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లను ఎన్నుకునేలా వెసులుబాటు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు పంచాయితిరాజ్ చట్టాన్ని సవరించింది రాష్ట్ర సర్కార్. 2018 పంచాయతీ రాజ్ చట్టంలోని 147, 176 సెక్షన్లకు సవరణ.అక్రమాలు, ఫిరాయింపులకు ఆస్కారం లేకుండా చట్ట సవరణ చేశారు.

జూన్ 4 న ఎంపీటీసీ, జేడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఆ తరువాత స్వల్ప విరామంతోనే చైర్ పర్సన్ల ఎన్నికను నిర్వహించనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీలు జులై ప్రమాణస్వీకారం చేయనున్నారు. జులై 3వ తేదిన ఎంపీటీసీలు, 4న జెడ్పీటీసీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆగస్ట్ లో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

- Advertisement -