15 రాష్ట్రాల సీఎంలతో మోడీ సమావేశం…

184
modi
- Advertisement -

నేడు 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.కరోనా కట్టడి, లాక్ డౌన్ ఎత్తివేత, పలు ఇతర అంశాలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు.కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలతో నేడు సమావేశం జరగనుంది.

కోవిడ్‌ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడడం ఇది ఆరోసారి. కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్న 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లతో ప్రధానమంత్రి మంగళవారం మాట్లాడారు.

దేశంలో కొన్ని వారాలుగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ప్రధాని వివరించారు. మహమ్మారిని ఎదుర్కోవటానికి సకాలంలో తీసుకున్న నిర్ణయాలు దేశంలో దాని వ్యాప్తిని నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేశాయని ప్రధాని తెలిపారు. ప్రతి ప్రాణాన్ని కాపాడటానికి ప్రయత్నించామని ప్రధాని అన్నారు.

- Advertisement -