కరోనా పంజా..24 గంటల్లో 2003 మంది మృతి

191
coronavirus
- Advertisement -

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. రోజుకు పదివేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. అయితే గత 24 గంటల్లో కరోనా మహమ్మారి విలయతాండవానికి 2003 మంది ప్రాణాలు కొల్పోయారు.

కొత్తగా 10,974 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,54,065కు చేరాయి. ఇప్పటివరకు దేశంలో మృతుల సంఖ్య 11,903కు చేరగా 1,55,227 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ వైరస్‌ నుంచి 1,86,935 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

మహారాష్ట్రలో అత్యధికంగా 1,13,445 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 5,537 మంది చనిపోయారు. తమిళనాడులో 48,019 కేసులు నమోదుకాగా 528 మంది మృతిచెందారు.

- Advertisement -