27న సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌..

159
PM Modi Video Conference with CMs on May 11
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. సెప్టెంబర్ నాటికి కరోనా తీవ్రత మరింత పెరగనున్న నేపథ్యంలో మరోసారి అన్నిరాష్ట్రాల సీఎంలతో సమావేశం కానున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.

ఈ నెల 27న జరిగే ఈ సమావేశంలో వైరస్‌ నియంత్రణ చర్యలు, బాధితులకు అందుతున్న వైద్యసేవలు, అన్‌లాక్‌ 3.0పై చర్చించనున్నట్లు సమాచారం.

జూన్‌ 16, 17 తేదీల్లో దశల వారీగా సీఎంలతో మోడీ సమావేశమయ్యారు. తాజాగా అన్‌లాక్ 2.0కి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అన్‌లాక్ 3.0పై కూలంకశంగా చర్చించనున్నారు అని తెలుస్తోంది.

- Advertisement -