కేదార్‌నాథ్‌లో ప్రధాని మోడీ..

113
modi
- Advertisement -

ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌లో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కేదారీశ్వ‌రుడికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. హార‌తి ఇచ్చారు. ఆ త‌ర్వాత ఆల‌యం చుట్టు ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు.

తన పర్యటనలో భాగంగా ఆదిశంకరాచార్యుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2013లో వ‌ర‌ద‌ల్లో దెబ్బ‌తిన్న శంక‌రాచార్య స‌మాధిని పున‌రుద్ద‌రిస్తున్న విష‌యం తెలిసిందే. కొత్తగా డిజైన్ చేసిన ఆది గురువు శంక‌రాచార్య విగ్ర‌హం 12 అడుగులు ఉండగా 2019 నుంచి శంక‌రాచార్య విగ్ర‌హ పున‌ర్ నిర్మార‌ణ ప‌నులు మొద‌ల‌య్యాయి. ఆదిశంక‌రాచార్య విగ్ర‌హం సుమారు 35 ట‌న్నుల బ‌రువుతో నిర్మించారు.

- Advertisement -