హైదరాబాద్‌కు ప్ర‌ధాని మోదీ.. ట్రాఫిక్ ఆంక్ష‌లు..

82
pm modi
- Advertisement -

ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో బేగంపేట ఎయిర్‌పోర్టు ప‌రిస‌రాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఉద‌యం 11 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు గ్రీన్ ల్యాండ్స్, ప్ర‌కాశ్ న‌గ‌ర్ టీ జంక్ష‌న్, ర‌సూల్‌పురా టీ జంక్ష‌న్, సీటీవో జంక్ష‌న్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయని పేర్కొన్నారు.

ఇక ప్ర‌ధానికి స్వాగ‌తం ప‌లికేందుకు వ‌చ్చే ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే అనుమ‌తిస్తారు. వీరంతా ఎయిర్‌పోర్టు పార్కింగ్ ఏరియాలో త‌మ వాహ‌నాల‌ను నిలుపుకోవ‌చ్చు. సిటిజెన్స్‌తో పాటు ఇత‌రులు ఎయిర్‌లైన్ కాల‌నీ పార్కింగ్ ఏరియాలో త‌మ వాహ‌నాల‌ను పార్కింగ్ చేయాల‌ని సూచించారు. అయితే ఉద‌యం 11 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని సూచించారు.

- Advertisement -