రాష్ట్రంలో ఫెర్రింగ్ ఫార్మా పెట్టుబడులు..

112
ktr
- Advertisement -

దావోస్ వేదికగా రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం వెల్లువలా వస్తున్నాయి. మంత్రి కేటీఆర్ కృషితో ఇప్ప‌టికే ప‌లు అంత‌ర్జాతీయ స్థాయి కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకురాగా తాజాగా ఫెర్రింగ్ ఫార్మా ముందుకొచ్చింది. ఇప్ప‌టికే త‌న తొలి యూనిట్‌ను ప్రారంభించిన ఫెర్రింగ్ ఫార్మా త‌న రెండో యూనిట్‌ను ప్రారంభించేందుకు సిద్ధ‌మైంది.

దాదాపు నెల క్రితమే హైదరాబాద్‌లో తమ ఉత్పత్తులను ప్రారంభించిన ఈ కంపెనీ.. ఇప్పుడు రెండో యూనిట్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది. ఇందుకోసం రానున్న రెండు మూడేండ్లలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. మంత్రి కేటీఆర్‌తో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఈ సంద‌ర్భంగా ఫెర్రింగ్ ఫార్మా కంపెనీ ప్ర‌తినిధుల‌కు కేటీఆర్ ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

- Advertisement -