మాజీ ప్రధాని వాజ్‌పేయికి ఘన నివాళి

79
modi
- Advertisement -

ఇవాళ దివంగత మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి నాలుగో వర్ధంతి. వాజ్‌పేయికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధంకర్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సమాధి ఉన్న న్యూఢిల్లీ స్మారక స్థలం ‘సదైవ్ అటల్‌’ వద్ద నేతలు నివాళులర్పించారు.

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డాతో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తన ముక్కుసూటి నిర్ణయాలతో రాజకీయ దురంధరుడిగా దేశ రాజకీయాల్లో తనకంటూ చెరగని ముద్రవేసుకున్నారు. రాజనీతిజ్ఞుడిగా, సాహితీ లోకానికి కవిగా, భారత దేశానికి ప్రధానిగా సేవలందించారు.

- Advertisement -