- Advertisement -
ఇక్రిశాట్ స్వర్ణోత్సవ లోగోను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఇక్రిశాట్లో పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. అందరికీ ఇక్రిశాట్ స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్రిశాట్ 50 ఏళ్ల ప్రయాణంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు.
ఈ రోజు ప్రధాని హైదరాబాద్ పర్యటనలో భాగంగా రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముందుగా ఆయన ఇక్రిశాట్ 50 ఏళ్ల ఉత్సవాలకు హాజరుకానున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
- Advertisement -