మోదీకి లీజియన్ ఆఫ్ మెరిట్‌ అవార్డు…

205
modi
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోదీని అత్యున్నత పురస్కారంతో సత్కరించింది అమెరికా. మోదీ తరపున ఈ అవార్డును స్వీకరించారు తరుణ్‌జిత్ సింగ్ సంధూ.అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడంలో మోదీ కృషి చేసినందుకు ప్రధాని మోదీకి అవార్డును అందజేసినట్లు అమెరికా అధికారి ఓ బ్రియన్ వెల్లడించారు.

మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేలకు ఈ పురస్కారాలు లభించాయి. ఆయా దేశాల రాయబారులు వీటిని అందుకున్నారు.

మోదీ…. 2016 లో సౌదీ అరేబియా ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్, ఘాజీ ఆమిర్ అమానుల్లాఖాన్ స్టేట్ ఆర్డర్ అవార్డును స్వీకరించారు. 2018లో గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా, 2019 లో యూఏఈ ఆర్డర్ ఆఫ్ ది జాయెర్ అవార్డు, రష్యా ఆర్డర్ ఆఫ్ ఎండ్రు పురస్కారాన్ని అందుకున్నారు.

- Advertisement -