ఏపీకి ప్రధాని మోడీ..

67
modi
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ టూర్ షెడ్యూల్ ఖరారైంది. జులై 4న ఏపీకి రానున్న మోడీ…. గోదావరి జిల్లా భీమవరంలో స్ధానిక ఏఎస్సార్ పార్కులో ఏర్పాటు చేస్తున్న 30 అఢుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జూలై 3న హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. రాత్రి హైదరాబాద్‌లోనే బస చేసి జులై 4 ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి విజయవాడ విమానాశ్రయం చేరుకుంటారు.

అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఉదయం గం.10-50కి భీమవరం చేరుకుంటారు. అక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసగింస్తారు.

- Advertisement -