దేశంలో 24 గంట‌ల్లో 11,793 క‌రోనా కేసులు..

64
covid19
- Advertisement -

దేశంలో కరోనా వైరస్‌ మళ్ళీ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. మహమ్మారి విజృంభిస్తుండటంతో రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గ‌త 24 గంట‌ల్లో 11,793 కేసులు న‌మోదుకాగా దీంతో మొత్తం కేసులు 4,34,18,839కు చేరాయి. క‌రోనా నుండి 4,27,87,092 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో 5,25,047 మంది మృతిచెందారు.

ప్ర‌స్తుతం దేశంలో 96,700 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.21 శాతానికి చేరాయి, రికవరీ రేటు 98.57 శాతంగా ఉంది. ఇప్పటిరకు 197.31 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

- Advertisement -