పద్మ అవార్డులకు మీరే నామినేట్​ చేయండి: ప్రధాని మోదీ

120
pm modi
- Advertisement -

ప‌ద్మ అవార్డుల కోసం మీరే నామినేట్ చేయండి అంటూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశ ప్ర‌జల‌కు పిలుపునిచ్చారు. సాధారణంగా పద్మ అవార్డుల కోసం రాష్ట్రాల ప్రభుత్వాలు.. వివిధ రంగాల్లో విశేష సేవ, కృషి చేసిన వారి పేర్లను కేంద్రానికి పంపుతుంటాయి. అయితే, ఈ సారి ప్రధాని నరేంద్ర మోదీ ఓ కొత్త సంప్రదాయానికి తెరతీశారు. ‘మంచి పనులు చేసిన వారి పేర్లను మీరే చెప్పండి’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

‘‘భారత్‌లో ఎంతోమంది నైపుణ్యం కలిగిన వారున్నారు. వారి వారి రంగాల్లో విశేష కృషి చేస్తున్నారు. అయితే, అలాంటి వారి గురించి మనం ఎప్పుడూ తెలుసుకోలేకపోతున్నాం. అలాంటి వారి గురించి మీకేమైనా తెలుసా? మీకు తెలిసిన వారున్నారా? అయితే, వారి పేర్లను పద్మ అవార్డుల కోసం మీరే నామినేట్ చేయండి. సెప్టెంబర్ 15లోపు వారి పేర్లను పంపండి’’ అని ప్రధాని ట్వీట్ చేశారు. పీపుల్ పద్మ అంటూ హాష్ ట్యాగ్‌తో పేర్లను నామినేట్ చేయాల్సిన వెబ్ సైట్‌ను ఆయన పోస్ట్ చేశారు. ఎవరికైనా ఎవరైనా తెలిసుంటే padmaawards.gov.in లో నామినేట్ చేయవచ్చు. మోదీ ప్ర‌భుత్వం కొన్నేళ్లుగా ఇలా క్షేత్ర‌స్థాయిలో సేవ‌లు చేస్తూ బ‌య‌టి ప్ర‌పంచానికి పెద్ద‌గా తెలియ‌ని ఎంతో మంది వ్య‌క్తుల‌కు ప‌ద్మ అవార్డులు ప్ర‌క‌టిస్తోంది.

- Advertisement -