ప్రధాని మోదీ…అమెరికా టూర్‌ డీటైల్స్

161
modi
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా టూర్ డీటైల్స్‌ విడుదలయ్యాయి. అమెరికాలో పర్యటనలో భాగంగా జో బైడెన్‌ తో పాటు ఆస్ట్రేలియా, జపాన్‌ ప్రధానులతో భేటీ కానున్నారు. మోడీతో పాటుగా అయన బృందంలో విదేశీ వ్యవహరాల మంత్రి ఎస్.జయశంకర్, విదేశీ వ్యవహరాల కార్యదర్శి హెచ్.వి. శ్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు, భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.

సెప్టెంబర్ 24 న అమెరికా అధ్యక్షుడు జోయ్ బైడెన్ తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అదే రోజు, ఇండియా, జపాన్, అస్ట్రేలియా, అమెరికా దేశాలు సభ్యులుగా ఉన్న “క్వాడ్” దేశాల సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. సాంకేతిక పరికరాల ఉత్పత్తి లో అగ్రగామిగా ఉన్న చైనా కు దీటుగా, సాంకేతిక అభివృద్ధి లో పరస్పర సహకారం, నాలుగు దేశాల ప్రయోజనాల పై ప్రధానంగా చర్చ జరగనుంది.

సెప్టెంబర్ 25 వ తేదీన ప్రధాని మోడీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. సెప్టెంబర్ 27 వ తేదీన ప్రధాని ఇండియాకు తిరిగి వస్తారు.

- Advertisement -