ఐఎన్ఎస్ విక్రాంత్ దేశానికే గర్వకారణం..

123
modi
- Advertisement -

ఐఎన్ఎస్ విక్రాంత్ చూసి ప్రతి భారతీయుడు గర్వించాలని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఐఎన్ఎస్ విక్రాంత్ సాతంత్ర్య సమరయోధుల కలలకు సాకారంగా నిలుస్తుందని చెప్పారు.

మన దేశం తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని..సొంతంగా వాహక నౌకను అభివృద్ధి చేసిన దేశాల సరనస నిలిచామని తెలిపారు. దేశానికి కొత్త భరోసా ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా సాధ్యమని …దీని నిర్మాణంలో పాల్గొన్న అందరికీ అభినందనలని అన్నారు. కేరళ తీరంలో ఇవాళ నవశకం ప్రారంభమైందని చెప్పారు.

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌక మన దేశ శక్తికి ఐకాన్ గా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. 1971 యుద్ధ సమయంలో విక్రాంత్ నౌక కీలక పాత్ర పోషించిందని చెప్పారు.

- Advertisement -