మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు..

182
petrol
- Advertisement -

పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారి సమీక్షలో భాగంగా ఇవాళ కూడా పెట్రోల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి చమురు కంపెనీలు. పెట్రోలుపై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచడంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సరికొత్త రికార్డుకి చేరాయి.

హైదరాబాద్‌లో పెట్రోలుపై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసల చొప్పున పెరిగాయి. దీంతో లీటరు డీజిల్‌ రూ.100.51కి చేరుకోగా, లీటరు పెట్రోలు రూ.107.73కు పెరిగింది. దేశ రాజధానిలో లీటరు పెట్రోల్‌ ధర రూ.103.54కు చేరగా, డీజిల్‌ ధర 92.17కు పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్‌ రూ.109.54, డీజిల్‌ రూ.99.22, చెన్నైలో పెట్రోల్‌ 101.01, డీజిల్‌ 96.60, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.104.23, డీజిల్‌ రూ.95.23కు చేరాయి.

- Advertisement -