పవన్‌ జగిత్యాల టూర్ షెడ్యూల్ ఇదే

36
- Advertisement -

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. రేపు(జనవరి 24)న ఉదయం 11 గంటలకు కొండగట్టుకు చేరుకుంటారు.కొండగట్టు ఆంజనేయుని ఆలయంలో తన ఎన్నికల ప్రచార రథం వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నాచుపల్లి శివారులోని రిసార్టులో జనసేన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పవన్ పాల్గొననున్నారు.

32 నారసింహ క్షేత్రాల సందర్శన యాత్రలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ధర్మపురి లక్ష్మీనారసింహ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. ధర్మపురిలో సాయంత్రం 5 గంటలకు జనసేన కార్యదర్శులతో పవన్ సమావేశం కానున్నారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై పార్టీ నేతలతో చర్చించి దిశానిర్ధేశం చేయనున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -