‘వీర’ విజయోత్సవంలో హాట్ కామెంట్స్

18
- Advertisement -

బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ స‌క్సెస్ మీట్‌ ను నిన్న రాత్రి హైద‌రాబాద్‌లో ఘనంగా నిర్వ‌హించారు. అయితే, ఈ స‌క్సెస్ మీట్‌లో ‘మాతో పెట్టుకోకు’ సినిమాలో నుంచి ‘మాఘ‌మాసం ల‌గ్గం పెట్టిస్తా’ అనే పాట‌ను బాలయ్య బాబు సింగర్లతో కలిసి పాడటం అందర్నీ ఆకట్టుకుంది. ఆ పాటకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అన్నట్టు బాలయ్య బాబు తన పాటతోనే కాదు, ఓ హాట్ కామెంట్ తో కూడా ‘వీరసింహా రెడ్డి’ విజయోత్సవ సభలో హీట్ పుట్టించారు.

ఇంతకీ ఏ కామెంట్ చేశారంటే.. ”గోపీచంద్‌ మలినేని నా సినిమా ‘సమరసింహారెడ్డి’చూసేందుకు వెళ్లి దెబ్బలు తిన్నారు. కారణమేంటో చెబితే ఇప్పుడు ఆయనపై కేసు కూడా నమోదు చేస్తారు. కేసులు బుక్‌ చేయడం ఇప్పుడు చాలా తేలిక కదా !”అని బాలయ్య అన్నారు. జగన్ సర్కార్‌ను ఉద్దేశించే బాలయ్య బాబు ఈ పరోక్ష వ్యాఖ్యలు చేశారని చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. అన్నట్టు ‘వీర సింహారెడ్డి’ విజయోత్స వేడుకలో తమన్ మాట్లాడిన మాటలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి.

తమన్ మాట్లాడుతూ.. ‘బాలయ్య బాబు ‘భైరవద్వీపం’ సినిమాతోనే నా కెరీర్ మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఇక ‘అఖండ’ నుంచి నేను బాలయ్యను శివుడు మాదిరిగానే చూస్తున్నాను. నా లైఫ్ కి ఆయనే శివుడు. అందువల్లనే ఆయన సినిమాకి ఇలాంటి మ్యూజిక్ ను ఇవ్వగలుగుతున్నాను’ అని తమన్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -