ఆగని వాల్తేరు సునామి!

46
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. రవితేజ కీలక పాత్రలో నటించగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న రిలీజైంది. విడుదలైన తొలిరోజు బెనిఫిట్ షో నుండి పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లు రాబడుతోంది. సినిమాప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.175 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుంది.

8వ రోజు వాల్తేరు వీరయ్యకి వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కంటే 9వ రోజు అంటే శ‌నివారం వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. 9 రోజుల‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి రూ.88.37 కోట్లు షేర్ వ‌సూళ్లు వ‌చ్చాయి.

గ్రాస్ వసూళ్ల ప్ర‌కారం చూస్తే అది రూ 142.60 కోట్లు అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. కర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియా క‌లిపి రూ. 6.90 కోట్లు రాగా ఓవ‌ర్ సీస్‌లో రూ. 11.45 కోట్లు షేర్ వ‌సూళ్లు వ‌చ్చాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే 9 రోజుల‌కు క‌లిపి రూ.106.72 కోట్లు షేర్ వ‌సూళ్లు వ‌చ్చాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -