నందమూరి నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే స్టేజ్ మీద కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అన్స్టాపబుల్ షో సెకండ్ సీజన్ లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తయింది. కాగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆహాలో స్ట్రీమింగ్ కానున్న బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినబడుతోంది. ప్రభాస్ ఎపిసోడ్ మాదిరే.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ని కూడా రెండు పార్ట్లుగా తీసుకొస్తున్నారని టాక్ నడుస్తోంది.
తొలి ఎపిసోడ్ ఫిబ్రవరి 3వ తేదీన స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఐతే, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రాబోతుందని చాలా రూమర్లు వినిపించాయి. ప్రస్తుతం ఆహా టీమ్ నుంచి వస్తోన్న లీకుల ప్రకారం కూడా ఫిబ్రవరి 3నే పవన్ ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది అంటున్నారు. మొదటి బాగం ఎపిసోడ్ లోనే బాలకృష్ణ.. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వివాదం గురించి ప్రశ్నించారట. దానికి పవన్ కల్యాణ్ చాలా క్లియర్గా వివరించినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఇక నుంచి పవన్ కల్యాణ్ ను పర్సనల్గా టార్గెట్ చేస్తే, వాళ్లు ఊర కుక్కలతో సమానం అని బాలయ్య కామెంట్ చేశారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ భారీగా హైలెట్ కానుంది. అన్నిటికీ మించి ఈ ఎపిసోడ్ పై ఏపీ రాజకీయాలు కూడా ముడిపడి ఉన్నాయి. కారణం పవన్ – బాలయ్య జగన్ ప్రభుత్వం పై కూడా విమర్శలు చేశారు. నిజానికి బాలయ్య – పవన్ ల మధ్య రాజకీయ వార్ ఉన్నా.. ఇప్పుడు ఇద్దరి టార్గెట్ ఒక్కటే. జగన్ ను సీఎం పదవి నుంచి దించడం. ఈ నేపథ్యంలో పవన్ – బాలయ్య రాజకీయాల గురించి ఏం మాట్లాడుకున్నారో చూడాలి.
ఇవి కూడా చదవండి…