నరేష్‌లో ఆమెకు అది నచ్చిందట

51
- Advertisement -

టాలీవుడ్ సీనియర్ నటులు నరేష్-పవిత్ర లోకేష్ జంటగా నటిస్తున్న ‘మళ్లీ పెళ్లి’ మే 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పవిత్ర లోకేష్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆసక్తికర విషయాలను చెప్పారు. ‘‘నరేష్ ఎంత సీరియస్ విషయాన్ని అయినా చాలా లైట్ తీసుకొని, దానికి ఏం కావాలో చాలా సీరియస్‌గా చేస్తారు. ఆ క్యాలిటీ నాలో లేదు. ఉన్నదాంట్లో సంతోషంగా వుండాలని అనుకుంటారు. ఈ క్యాలిటీ ఆయనలో నాకు నచ్చింది’’ అని పవిత్ర లోకేష్ అన్నారు.

పవిత్ర లోకేశ్ ఇంకా మాట్లాడుతూ “కొంతమంది మా పరిస్థితులను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారం చేశారు. నా కెరియర్ పై దెబ్బకొట్టడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో నేను ఒంటరిగా ఉంటే ఆత్మహత్య చేసుకోవాలి లేదా ఇంట్లో కూర్చోవాలి.. కానీ అలాంటి పరిస్థితుల్లో నరేశ్ అండగా నిలబడటం వల్లే నేను మళ్లీ బయటికి రాగలిగాను” అని పవిత్రా చెప్పుకొచ్చింది.

Also Read:రోహిణి కార్తె..తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

ఇక నరేశ్, నటి పవిత్ర లోకేశ్‌ ఎట్టకేలకు త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. అతి కొద్ది మంది సమక్షంలో సంప్రదాయ బద్ధంగా వీరి పెళ్లి వేడుక జరిగనుంది. ‘ఒక పవిత్ర బంధం. రెండు మనసులు. మూడు ముళ్లు. ఏడు అడుగులు. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు పవిత్ర నరేశ్’ అని ఆ మధ్య నరేష్ మెసేజ్ కూడా చేసిన సంగతి తెలిసిందే.

Also Read:లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. !

- Advertisement -