ఐదు రోజుల్లో 500 కోట్లు.. గ్రేట్

15
- Advertisement -

షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ సినిమా భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. తాజాగా ఈ మూవీ రూ.500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. అది కూడా ఐదు రోజుల్లోనే. ఇంత త్వరగా ఆ ఫీట్‌ను అందుకున్న తొలి బాలీవుడ్‌ మూవీగా సరికొత్త రికార్డు సృష్టించింది. దశాబ్దానికి పైగా హిట్టులేని షారుఖ్‌ ఇలాంటి ఘనతను సాధించాడంటే ఆయన క్రేజ్‌ ఏలాంటిదో తెలుస్తుంది. కేవలం బాలీవుడ్‌లోనే కాదు తెలుగులోనూ పఠాన్‌ సినిమా వసూళ్ల మోత మోగిస్తుంది. పఠాన్ విజయంపై షారుఖ్ ఖాన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

షారుఖ్ మాట్లాడుతూ..”గత నాలుగు రోజుల కారణంగా గడిచిన నాలుగేళ్లను మర్చిపోయాను” అని అన్నారు. “ఇది మాకు, నా కుటుంబానికి గొప్ప రోజు, మేం ఈ ఆనందాన్ని చాలా సంవత్సరాలుగా అనుభవించలేకపోయాము’ అని అన్నారు. మొత్తానికి పఠాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇక షారుఖ్ పై బాలీవుడ్ హీరోలు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. షారుఖ్ ఖాన్ దేశంలోనే నంబర్ వన్ యాక్షన్ హీరో అని బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం అన్నారు.

‘పఠాన్’ సక్సెస్ మీట్‌లో జాన్ అబ్రహం షారుఖ్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘షారుఖ్ ఒక నటుడు కాదు. ఒక ఎమోషన్. షారుఖ్ ఇంతకు ముందు యాక్షన్ హీరోనే. కానీ, ఇవాళ దేశంలోనే నంబర్ వన్ యాక్షన్ హీరో’’ అని కొనియాడాడు. జనవరి 25న రిలీజైన ఈ మూవీ ఇంత గొప్ప సక్సెస్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అందుకే, ఇప్పుడు అందరి చూపు బాలీవుడ్ పైనే ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -