గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన బల్విందర్ సింగ్..

269
Patas Balwinder Singh
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా చిలుకనగర్ కార్పొరేటర్ గోపు సరస్వతి సదానందం ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన పటాస్ షో ఫేమ్ బల్విందర్ సింగ్ నేడు ఉప్పల్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బల్విందర్ సింగ్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది ఒక మంచి కార్యక్రమం అని అందులో నేను కూడ పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమంలో తనననీ భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా బల్విందర్ సింగ్ మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ చేశారు.పటాస్ షోలో పాల్గొంటున్న శరత్,ఫైమ మరియు ప్రవీణ్‌లను మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గోపు సరస్వతి సదానందం పాల్గొన్నారు.

- Advertisement -