వలస కూలీలకు అండగా ఉంటాం: పద్మారావు

474
padmarao goud
- Advertisement -

మంత్రి కేటీఆర్ పెట్టిన ట్వీట్ కు స్పందించారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్. లాక్ డౌన్ సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడ డివిజన్‌లో నివసిస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని పద్మారావు గౌడ్‌కి ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.

దీనికి స్పందించిన పద్మారావు తన తనయుడు రామేశ్వర్ గౌడ్ చేత భోజన ఏర్పాట్లు చేపించారు. ఎలాంటి ఇబ్బంది ఉన్న తనని సంప్రదించాలని , తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటుందని తెలిపారు.

- Advertisement -