విత్త‌నాల‌ రవాణాకు ఆటంకాలు లేకుండా చూడాలిఃవినోద్ కుమార్

216
B vinodkumar
- Advertisement -

దేశ వ్యాప్తంగా సీడ్స్ రవాణాకు ఆటంకాలు లేకుండా చూడాలి అన్నారు. ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్. విత్తనాలు ( సీడ్స్ ) సరఫరాకు రవాణా పరంగా ఎదురవుతున్న ఆటంకాలు లేకుండా చూడాలని సీడ్స్ ఉత్పత్తిదారులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను కోరారు. మంగళవారం బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ నివాసంలో వినోద్ కుమార్ కు వారు తమ సమస్యలు వివరించారు.లాక్ డౌన్ వల్ల తమకు రాష్ట్రంలో గానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ రవాణా పరంగా సమస్యలు ఎదురవుతున్నాయని వారు వినోద్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు.

తెలంగాణ వ్యాప్తంగా 400 సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయని, సుమారు మూడు లక్షల మంది రైతులు విత్తన ఉత్పత్తిదారులుగా ఉన్నారని వారు వినోద్ కుమార్ కు తెలిపారు.ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి విత్తనాలు ప్రాసెస్ చేసి దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు సరఫరా చేస్తున్నామని వారు పేర్కొన్నారు.వివిధ రకాల పంటలు చేతికి అందుతున్న నేపథ్యంలో రైతుల నుంచి విత్తనాలు ప్రాసెసింగ్ చేసేందుకు యూనిట్లకు చేరాల్సి ఉండగా లాక్ డౌన్ వల్ల జిల్లాల్లో క్షేత్ర స్థాయి పోలీసులు సీడ్స్ రవాణాను అడ్డుకుంటున్నారని వారు వినోద్ కుమార్ కు విన్నవించారు.

క్షేత్ర స్థాయి పోలీసుల ఇబ్బందుల వల్ల సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్లకు కూలీలు కూడా రాలేని దుస్థితి ఏర్పడిందని వారన్నారు.బ దేశవ్యాప్తంగా అవసరమైన 80 శాతం సీడ్స్ తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయని, అలాంటప్పుడు రాష్ట్రంలోనే ఇబ్బందులు వస్తే ఎలా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యలపై తక్షణమే స్పందించిన వినోద్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. విత్తన ఉత్పత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. లాక్ డౌన్ నుంచి సీడ్స్ సరఫరాను సీఎం కేసీఆర్ మినహాయింపు ఇచ్చారని వినోద్ కుమార్ డీజీపీ కి గుర్తు చేశారు. వెంటనే రంగంలో దిగిన డీజీపీ మహేందర్ రెడ్డి డీఐజీ సుమతిని నోడల్ అధికారిగా నియమించి విత్తన ఉత్పత్తిదారులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూడాలని ఆదేశించారు.

- Advertisement -