కరోనా వేగంగా విస్తరిస్తోంది.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి..

178
minister etala
- Advertisement -

గతంలో కంటే కరోనా వేగంగా విస్తరిస్తోందని… ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. ఈరోజు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలో మంత్రి ఈటల పర్యటించారు. ఇందులో భాగంగా చెల్పూర్ గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ( పి.హెచ్.సి) మంత్రి ఈటల సందర్శించారు. ఆసుపత్రిలో సౌకర్యాలు గురించి పేషేంట్స్ ను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కొరత కూడా ఉందని మంత్రి ఈటల అన్నారు. తెలంగాణలో ఆక్సిజన్ కొరత వాస్తవమేనని ఈటల స్పష్టం చేశారు. అయితే ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

25 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ను కోరామని ఈటల తెలిపారు. తమ అభ్యర్థనపై ఆయన సానుకూలంగా స్పందించారని… అయితే, ఎలాంటి హామీ మాత్రం ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణలో లాక్ డౌన్ కానీ, నైట్ కర్ఫ్యూ కానీ ఇప్పట్లో విధించే అవకాశం లేదని తెలిపారు. కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందని… అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని మంత్రి కోరారు.

- Advertisement -