పూర్తి స్థాయిలో కోవిడ్ ఆసుపత్రిగా గాంధీ ఆసుపత్రి..

282
Gandhi Hospital
- Advertisement -

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో కోవిడ్ ఆసుపత్రిగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం నుంచి ఓపీ సేవలు నిలిపి వేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం కరోనా పేషెంట్లకు మాత్రమే సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఇప్పటికే గాంధీలో 450 మందికి పైగా కరోనా పేషెంట్లు ఉన్నారు. నిన్న ఒక్క రోజే 150 మంది అడ్మిట్ అయ్యారు.

ఆసుపత్రిలోని ఇన్ పేషెంట్ బ్లాక్ మొత్తం కరోనా పేషెంట్లతో నిండిపోయింది. కరోనా ఫస్ట్ వేవ్ సందర్భంలో కూడా గాంధీని పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చారు. అయితే, ఆ తర్వాత కేసులు తగ్గడంతో ఇతర పేషెంట్లను కూడా అనుమతించారు. ఇప్పుడు సెకండ్ వేవ్ సందర్భంగా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో గాంధీని మరోసారి పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చారు.

- Advertisement -