ఓల్డ్ మలక్‌పేటలో కొనసాగుతున్న పోలింగ్…

187
old malakpet
- Advertisement -

హైదరాబాద్ ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్ కొనసాగుతోంది. బ్యాలెట్‌ పేపర్‌లో సీపీఐ అభ్యర్థి గుర్తు తప్పుగా ముద్రించడంతో రీపోలింగ్‌ జరుగుతుండగా కరోనా జాగ్రతలతో పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవుతో పాటు మద్యం దుకాణాల బంద్, ప్రచారం నిషేధం వంటివన్నీ అమలులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

వార్డులో మొత్తం ఓట్లు: 54,655గా ఉండగా 69 పోలింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. వెబ్‌కాస్టింగ్‌ జరిగే పోలింగ్‌ కేంద్రాలు:23. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌ పరిధిలో పోలింగ్‌ సందర్భంగా గురువారం సెలవు ప్రకటించినట్లు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి తెలిపారు.

- Advertisement -