బండి సంజయ్‌ కరీంనగర్‌కు ఏం చేశారు: ఎమ్మెల్సీ కవిత

152
mlc nizamabad
- Advertisement -

బండి సంజయ్‌ ఎంపీగా గెలిచి రెండేండ్లు అయిందని ఇప్పటివరకు కరీంనగర్‌కు ఏం చేశారో తెలుపాలని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన కవిత… జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్‌ తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు.

కరీంనగర్ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని …సంజయ్‌ను ప్రజలు నిలదీయాలన్నారు. సంజయ్‌కు ధైర్యం ఉంటే రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలపై కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు.

రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని అన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమాఖ్య స్ఫూర్తిని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తుందని ఆక్షేపించారు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన బీఎస్టీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -