పోలీస్‌ కస్టడీలో బిగ్ బాస్ కంటెస్టెంట్..

280
Nutan Naidu
- Advertisement -

దళిత యువకుడు పర్రి శ్రీకాంత్‌ శిరోముండనం కేసులో అరెస్టైన సినీ నిర్మాత, బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్‌ నాయుడిని పోలీసులు విచారిస్తున్నారు. అంతేకాదు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట పైరవీలు చేసిన విషయంపై కూడా లోతుగా విచారణ చేపట్టనున్నారు. నూతన్ నాయుడుని విశాఖ కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండులో వున్నారు.

ఆయనను మరింత లోతుగా విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విశాఖ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో శని, ఆది, సోమవారాల్లో విచారించడానికి పోలీసులకు జడ్జి అనుమతించారు. మరోవైపు దళిత యువకుడు శ్రీకాంత్ కు శిరోముండనం చేసిన కేసులో నూతన్ నాయుడి భార్య మధుప్రియ సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -