‘ఎన్టీఆర్ 30’కి ముహూర్తం ఖరారు

15
- Advertisement -

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రానుంది. ఐతే, ఈ పాన్ ఇండియా సినిమాకి సంబంధించి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్‌ ఒకటి బయటకు వినిపిస్తోంది. ఈనెల 23న ఈ సినిమాని గ్రాండ్‌గా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మార్చి మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ పోర్టు సెట్‌ను కూడా సిద్ధం చేశారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.

ఐతే, ఈ సినిమాలో ఎన్టీఆర్ తల్లి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని.. ఈ పాత్ర కోసం కొరటాల శివ, సీనియర్ స్టార్ హీరోయిన్ విజయశాంతిని తీసుకుంటున్నారట. కొరటాల శివ ఇప్పటికే విజయశాంతిని కూడా సంప్రదించాడట. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కోసం విజయశాంతిని కొరటాల ఫిక్స్ చేశాడు. పైగా ఈ సినిమాని అంతర్జాతీయ మూవీగా కొరటాల శివ తెరకెక్కించబోతున్నాడు. అందుకే, నటీనటుల విషయంలో కొరటాల శివ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించబోతుంది.

ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ కలిసి నటిస్తే.. ఆ స్క్రీన్ విజువల్స్ అదిరిపోతాయి. పైగా జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కూడా హిందీ ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు. కాబట్టి.. జూనియర్ ఎన్టీఆర్ – జాన్వీ కపూర్.. సో.. ఈ ఇద్దరికి తోడు విజయశాంతి. మొత్తానికి ఏ రకంగా చూసుకున్నా, ఎన్టీఆర్ – కొరటాల సినిమాకి భారీ బజ్ క్రియేట్ అయ్యేలా ఉంది. ఆ బజ్ కి తగ్గట్టుగానే ఖర్చు కూడా పెడుతున్నారు. ఇందులో భాగంగా ఓ హాలీవుడ్‌ యాక్షన్ కొరియగ్రాఫర్ ను తీసుకోబోతున్నారు.

ఇవి కూడా చదవండి…

మహేష్ కి విలన్ ఎవరంటే?

మార్చి4… ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

ఎన్టీఆర్ ప్లాన్ అదేనా ?

- Advertisement -