మార్చి4… ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

26
- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. గతంలో పోకిరి, జల్సా, ఖుషీ, బాద్‌షా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. అలాంటి కోవలోకే మరోసారి ఎన్టీఆర్ అదుర్స్‌ సినిమాతో వచ్చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన రీ-రిలీజ్ పనులను చకచకగా పూర్తిచేసుకుంటుంది. 25కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 80కోట్లకుపైగా కలెక్షన్స్‌ను రాబట్టింది. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు.

ఇందులో నయనతార, బ్రహ్మనందం, షీలాకౌర్, తదితర నటులు కీలకపాత్రలు పోషించారు. ముఖ్యంగా బ్రహ్మనందం-ఎన్టీఆర్ కామెడీ ట్రాక్‌ ఈ సినిమాకే హైలైట్‌. అదుర్స్‌ సినిమాకు కోన వెంకట్ కథను అందించగా దేవిశ్రీప్రసాద్ సంగీతంను అందించారు. అన్నట్టు అదుర్స్‌ మార్చి4న థియేటర్‌లోకి కానుంది. ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ తర్వాత ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. కొరటాల శివ ఎన్టీఆర్30 చేయబోతున్నారు. అలాగే కేజీఎఫ్ ఫేమ్‌ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

ఇందులో తప్పేం ఉంది ? – మృణాల్

ఎన్టీఆర్ ప్లాన్ అదేనా ?

ఫిబ్రవరి18..రావణాసుర ప్యార్‌లోన పాగల్

- Advertisement -