‘ఎన్టీఆర్ 30’.. మళ్లీ లీకుల కలకలం

47
- Advertisement -

కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తుంటే.. మరోవైపు ఆ సినిమాలోని కంటెంట్ లీక్ అవుతూ ఉంటే.. ఎవరికైనా బాధగానే ఉంటుంది. ప్రస్తుతం ఆ బాధనే అనుభవిస్తున్నాడు కొరటాల శివ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ‘NTR 30’ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఐతే, ఈ సినిమాకి లీకుల బెడద తప్పడం లేదు. రీసెంట్ గా ఈ సినిమా షూట్ నుంచి ఓ పిక్ ఒకటి బయటకు వచ్చి వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ సినిమాలోని రెండు పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా లీక్ అయ్యాయి.

కొన్ని రోజుల కిందట ‘యుద్ధం తథ్యం అయితే, కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించకు” అనే డైలాగ్ లీకై హల్ చల్ చేసింది. ఇప్పుడు మరో డైలాగ్ కూడా లీక్ అయింది. ‘సమయం యుద్ధాన్ని కోరినప్పుడు, ప్రకృతి తన సారథిని పంపిస్తుంది. ప్రకృతి కోరలను బలిచ్చే ధీరుని ప్రతాపానికి ప్రపంచం ఆ సమయంలో సిద్ధంగా ఉంటుంది” అనే డైలాగ్ కూడా లీకైంది. ప్రస్తుతం ఈ డైలాగ్ కూడా వైరల్ గా మారింది. సముద్రం బ్యాక్ డ్రాప్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

Also Read:ఎన్టీఆర్‌కి హాలీవుడ్ దిగ్గజం ఫిదా

హాలీవుడ్ స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఈ సినిమాకు కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 5, 2024న విడుదల చేయనున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ మూవీ రాబోతోంది. ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డు వచ్చిన క్రమంలో ఈ సినిమా పై మరింత అంచనాలు పెరిగాయి. అందుకే ఈ సినిమాని అంతర్జాతీయ మూవీగా తెరకెక్కిస్తున్నారు.

Also Read:కడుపు నొప్పిని తగ్గించే చిట్కాలు

- Advertisement -